విద్యార్థులు దేశం కోసం జీవించాలి: ఎమ్మెల్యే

76చూసినవారు
విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. గురువారం ఉదయం నరసాపురం మండలం రుస్తుంభాద సెవెంత్ డే అడ్వెంటెస్ట్ స్కూల్ నందు 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండి దేశభక్తిని అలవర్చుకుని దేశం కోసం జీవించాలని సూచించారు. తొలుతగా ఆయనకు స్కూల్ ప్రెసిడెంట్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్