ఉండి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి మొత్తం 21 మంది అభ్యర్థులు, 38 సెట్ల నామినేషన్లు పత్రాలు దాఖలు చేశారని జెసి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. ఈనెల 26న నామినేషన్ల పత్రాల పరిశీలన జరుగుతుందని, ఈ నెల 29 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. పోటీ చేసే అభ్యర్ధుల తుది జాబితాను 29వ తేదీ సాయంత్రం గుర్తులతో సహా ప్రకటించడం జరుగుతుందని వివరించారు.