మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా అత్తిలి మండలం మంచిలి గ్రామం లో సోమవారం వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం వంటి కార్యక్రమాలతో ప్రజల హృదయాలలో రాజశేఖరరెడ్డి సుస్తిరంగా నిలిచిపోయారని స్థానిక నాయకుడు తేజ సోమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామారావు, గ్రామ అధ్యక్షుడు చిన్నురెడ్డి తదితరులు పాల్గొన్నారు.