పార్కు చుట్టూ ఆక్రమణలకు గురికాకుండా చూడాలి: ఎమ్మెల్యే

59చూసినవారు
పార్కు చుట్టూ ఆక్రమణలకు గురికాకుండా చూడాలి: ఎమ్మెల్యే
భీమవరంలోని బివి. రాజు మున్సిపల్ పార్కు చుట్టూ ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, ఆ ప్రాంతాన్ని సుందరీకరణ చెయ్యాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పార్క్ పరిసర ప్రాంతాలను మంగళవారం ఎమ్మెల్యే పూలపర్తి అంజిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎం. శ్యామల పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్క్ వద్ద ఉన్న వ్యాపారస్తులు రోడ్డు మీదకు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్