స్వచ్ఛత హి సేవ -24లో అందరూ భాగస్వాములు కావాలి

85చూసినవారు
స్వచ్ఛత హి సేవ -24లో అందరూ భాగస్వాములు కావాలి
స్వచ్ఛ భారత్‌ దినోత్సవం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవ -2024 లో అందరూ భాగస్వాములు కావాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదివారం అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ -2024 బ్రోచర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. మన పరిశుభ్రతే మన ఆరోగ్యమని, పరిసరాల పరిశుభ్రత సమాజ శ్రేయస్సన్నారు.

సంబంధిత పోస్ట్