రైస్ మిల్లర్ అసోసియేషన్ భారీ సహాయం

70చూసినవారు
రైస్ మిల్లర్ అసోసియేషన్ భారీ సహాయం
ప్రతి ఒక్కరూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు వస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం భీమవరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ 2 లక్షల 58 వేలను వరద బాధితులకు సహాయార్ధం ఎమ్మెల్యేకు అందించారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్