గోపన్నపాలెంలో భారీ అగ్ని ప్రమాదం

74చూసినవారు
ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో శుక్రవారం రాత్రి కిరాణా షాపు వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు, గ్రామస్థులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. భారీ మంటలు కావడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి షాపులో ఉన్న వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్