ద్వారకా తిరుమల ఎంపీపీగా బొండాడ మోహినీ వెంకన్నబాబు

1544చూసినవారు
ద్వారకా తిరుమల ఎంపీపీగా బొండాడ మోహినీ వెంకన్నబాబు
ద్వారకా తిరుమల మండలప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా బొండాడ మోహినీ వెంకన్నబాబు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పంగిడిగూడెం-2 ఎంపీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎంపికైన ఆమెను తిరుమల పాలెం-1ఎంపీటీసీ సభ్యుడు ఆకుర్తిసత్యనారాయణ ప్రతిపాదించారు. అలాగే జి కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు బిరుదు గడ్ల బజారయ్య ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఈమె మినహా ఎవరు నామినేషన్ వేయడంతో ఎన్నికల అధికారి సుబ్బారావు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. వైస్ ఎం పి పి గా వెంకటకృష్ణాపురం ఎం పి టి సి సభ్యురాలు యలమర్తి దుర్గా దేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో-ఆప్ష్నన్ సభ్యునిగా తిరుమల పాలెం కు చెందిన బాషా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్