వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలి: మహేశ్వరరావు

68చూసినవారు
వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలి: మహేశ్వరరావు
వేసవిలో ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని సిబ్బందికి డిఎం అండ్ హెచ్ ఓడి మహేశ్వరరావు సూచించారు. శనివారం మొగల్తూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంని సందర్శించారు. అనంతరం ఆర్సీఎం చర్చిలో చిన్నారులకు వేస్తున్న టీకాలు కార్యక్రమాన్ని ఆయన సందర్శించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆయన వెంట వైద్యులు ఓ దినేష్ కుమార్, ఎంపీహెచ్ఓ ఏఎస్ఎన్ మూర్తి, ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్