పిల్లలు పరిశుభ్రత పాటించేలా చూడాలి

65చూసినవారు
పిల్లలు పరిశుభ్రత పాటించేలా చూడాలి
పిల్లలు పరిశుభ్రత పాటించేలా చూస్తే కడుపులో నులిపురుగులు చాకకుండా నివారించవచ్చునని ప్రధానోపాధ్యాయుడు వారణాసి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపర్రు లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోజనమునకు ముందు పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలన్నారు. నులిపురుగుల నివారణ వలన పిల్లల ఎదుగుదల బాగుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్