పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: నిమ్మల

70చూసినవారు
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: నిమ్మల
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం పాలకొల్లు మంత్రి కార్యాలయంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం పై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తూతూ మంత్రంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించవద్దన్నారు. అలా చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్