కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామ శివారులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ద్విచ్రవాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.