ఏడుగురిపై విద్యుత్తు చౌర్యం కేసులు నమోదు
కొయ్యలగూడెం మండలం యర్రంపేట, రాజవరం గ్రామాల్లో విద్యుత్ను అక్రమంగా వినియోగిస్తున్నారని అందిన సమాచారంపై ఏలూరు విద్యుత్ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది ఆకస్మిక దాడులు చేసి ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాన్స్కో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవికుమార్ శనివారం తెలిపారు. ఆయా గ్రామాల్లో ఏడుగురు వ్యక్తులు తమ గృహాల్లోని ఏసీలకు విద్యుత్ను అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు.