సర్వే ఫలితాలన్నీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ చార్జ్ వలవల బాబ్జి పేర్కొన్నారు. బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీఆర్ బాండ్ల పేరుతో రూ. 100 కోట్లకు డిప్యూటీ సీఎం స్కెచ్ వేశారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అవకాశం లేకుండా పోయిందన్నారు. నాయకులు తాతాజీ, రాజేష్ పాల్గొన్నారు.