తాడేపల్లిగూడెం పట్టణం పుంతలో ముసలమ్మ ఆలయంలో మంగళవారం జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 23వ వార్డులో శ్రీనివాస్ ఇంటింటికీ వెళ్లి ప్రచార చేశారు. ఓటర్లను కలిసి తనను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు.