తాడేపల్లిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వలవల బాబ్జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేశారు. తొలుత బాబ్జీ టిడిపి జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.