బీసీలను తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుగా చూసిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ బీసీలకు ఏం చేస్తుందని స్పష్టంగా చెప్పిందన్నారు. రెండు ఎంపీ సీట్లు బీసీలకు కేటాయించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బీసీలు వెన్నుదన్నుగా నిలవాలన్నారు.