హెల్మెట్ వినియోగం పై తణుకులో అవగాహన ర్యాలీ

78చూసినవారు
హెల్మెట్ వినియోగం పై తణుకులో అవగాహన ర్యాలీ
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలనే అంశంపై తణుకు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తణుకు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏవీ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కృష్ణ సత్యలత, సిఐలు నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్