పాలకోడేరు మండలంలో గోస్తనీ నదికి గండి

77చూసినవారు
పాలకోడేరు మండలంలో గోస్తనీ నదికి గండి
పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలోని గోస్తనీ నదికి ఆదివారం రాత్రి గండిపడటంతో మోగల్లు చెందిన సుమారు 500 ఎకరాలు ఆయకట్టు నీట మునిగింది. ఈ సందర్భంగా సోమవారం గండి పడిన ప్రాంతాన్ని కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పొలాలు నీటి మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్