కాళ్లలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహాన్ని కాళ్ల ఇన్ఛార్జి తహశీల్దార్ ఇ. నాగార్జున ఆదివారం తనిఖీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. వసతి గృహాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, తాగునీరు, భోజనం మొదలైన వాటిని తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వార్డెన్ శ్రీకాంత్ వివరించారు.