ఉంగుటూరు: భవాని భక్తుడిని ఢీకొన్న కోళ్ల లారీ

81చూసినవారు
ఉంగుటూరు: భవాని భక్తుడిని ఢీకొన్న కోళ్ల లారీ
విజయవాడ కనకదుర్గమ్మ గుడికి కాలి నడకన వెళ్తున్న భవాని భక్తుడిని కోళ్ల లారీ ఢీకొంది. ఉంగుటూరు మండలం కైకరం వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కోనసీమ జిల్లా రాజవోలుకి చెందిన కాసుపు మణికంఠ విజయవాడ బయలుదేరాడు. చేబ్రోలు నుండి భీమడోలు వైపు వెళ్తున్న కోళ్ళ లారీ వెనక నుంచి ఢీకొంది. భవాని మాల ధార భక్తుడి కాలు ప్యాక్చర్ అయింది. హైవే అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్