బుట్టాయిగూడెంలో పొగాకు బ్యారన్ లు దగ్ధం
బుట్టాయిగూడెం మండలం ముప్పిన వారి గూడెం గ్రామంలో రైతు నాదెండ్ల రాంబాబుకి చెందిన పొగాకు బ్యారన్ దగ్ధం అవడంతో సుమారుగా 10 లక్షలు రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. పొగాకు మాత్రమే కాకుండా లోపల ఉన్నటువంటి కడ్డీలు, రేకులు, గోడలు అన్నీ కాలిపోయి కుప్ప కూలి పోవడంతో అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి. చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు పరుగులు తీస్తున్నారు.