భార్య అసెంబ్లీకి.. భర్త పార్లమెంట్‌కు పోటీ (వీడియో)

51చూసినవారు
ఢీపట్టా భూములపై 2020 నుంచి చేస్తున్న పోరాటం ఫలించకపోవడంతో ఓ పేదింటి దంపతులు ఎన్నికల బరిలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యాట్లబసివలసకు చెందిన కాయ దుర్గారావు, కామేశ్వరి దంపతులు చేపలు విక్రయిస్తూ బతుకుతున్నారు. ప్రస్తుతం వీరు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా దుర్గారావు, నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కామేశ్వరి బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్