AP: పోలింగ్ రోజు రాష్ట్రంలో అలజడుల సృష్టికి వైసీపీ కుట్ర చేసిందని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ఓటమి భయంతోనే అల్లర్ల సృష్టికి కుట్ర పన్నారని మండిపడ్డారు. "సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలి. నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా సజ్జలకు అవసరం లేదట. టీడీపీ, జనసేన ఏజెంట్లకు అడ్డంపడాలని సజ్జల హితబోధ చేయడం సిగ్గు చేటు." అని ఉమా విమర్శించారు.