వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును విస్మరించింది: మంత్రి దుర్గేష్

69చూసినవారు
వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును విస్మరించింది: మంత్రి దుర్గేష్
నేడు నిడదవోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును విస్మరించిందని విమర్శించారు. గత పాలకులకు పోలవరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదని, డాంబికాలు ప్రదర్శిస్తున్నారని అన్నారు. జలజీవన్ నిధులను గత ప్రభుత్వం పూర్తిగా ఖాళీ చేసిందన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు ఒకటి రెండు రోజుల్లో బకాయిలను చెల్లిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్