నిత్యావసరాల పంపిణీని గాల్లో దీపంలా మార్చేసి, చౌక బియ్యాన్ని పెద్ద ఎత్తున అక్రమార్కులు నల్లబజారుకు తరలిస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చౌకబియ్యం స్వాధీనం అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మిల్లుల్లోనూ వందల టన్నుల్లో రేషన్ బియ్యం బయటపడుతునే ఉన్నాయి. రాష్ట్రంలో నెలకు 2 లక్షల8 వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే అందులో 40 శాతం వరకు పక్కదారి పడుతున్నాయంటే అక్రమార్కుల దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.