సహకార వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి లెక్కలు తేల్చి తిన్నదంతా వసూలు చేస్తామని మీడియాతో చెప్పారు. సహకార సంఘాలు, డీసీసీబీల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త సంస్కరణలు తెచ్చి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.