మూడో విడత ప్రచారానికి వైసీపీ రోడ్ మ్యాప్

562చూసినవారు
మూడో విడత ప్రచారానికి వైసీపీ రోడ్ మ్యాప్
మేమంతా సిద్ధం బస్సు యాత్ర బుధవారంతో ముగిసింది. మూడో విడత ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల సభల్లో పాల్గొనేలా వైసీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో.. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ప్రతి రోజూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్