వైసీపీ సంచలన నిర్ణయం

63చూసినవారు
వైసీపీ సంచలన నిర్ణయం
ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు మంగళ, బుధవారాల్లో హాజరు కాకూడదని నిర్ణయించింది. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఢిల్లీలో గళం విప్పాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఈ కారణంతోనే రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్