యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం

51చూసినవారు
యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం
అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అనకాపల్లి పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో సింహాచలం వెళ్లి వస్తున్న యువతిని కిడ్నాప్ చేసి అనకాపల్లి పట్టణంలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాల్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. తన కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన తేజసాయి కుమార్‌తో పాటు మరో ఐదుగురిని అనకాపల్లి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్