డోర్ లాక్ అవడంతో కారులోనే చనిపోయిన ఇద్దరు చిన్నారులు

66చూసినవారు
డోర్ లాక్ అవడంతో కారులోనే చనిపోయిన ఇద్దరు చిన్నారులు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంది. ఆంటోప్ హిల్ వద్ద పార్క్ చేసి ఉన్న కారులోకి అక్కడే ఆడుకుంటున్న ముస్కాన్ మొహబ్బత్ షేక్ (5), సాజిద్ మహ్మద్ షేక్ (7) అనే ఇద్దరు చిన్నారులు ఎక్కారు. ఈ క్రమంలోనే కారు డోర్లన్నీ లాక్ అయ్యాయి. అద్దాలు కూడా తెరిచి లేకపోవడంతో చిన్నారులు ఊపిరి ఆడక మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్