దేశంలో ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతోన్న ప్రజలపై తాజాగా మొబైల్ కంపెనీలు ఛార్జీల బాదుడును ప్రారంభించాయి. రిలయన్స్ జియో తమ వినియోగదారులపై 25 శాతం వరకు అదనపు భారం మోపగా. అదే బాటలో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నిర్ణయం తీసుకున్నాయి. దిగ్గజ మూడు టెల్కోల నిర్ణయాలతో దాదాపు 100 కోట్ల మంది వినియోగదారుల జేబులకు చిల్లు పడనుంది. వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ధరల పెంపులో తొలి గిఫ్ట్ ఇదే కావడం గమనార్హం.