లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కేదెవరికి. 48 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడానికి కారణమైన డిప్యూటీ స్పీకర్ పదవిని అధికార ఎన్డీఏకు చెందిన ఎంపీనే చేపట్టనున్నారు. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కితే ఎవరికి ఇస్తారనేది చర్చ మొదలైంది. తాజాగా ఈ పేరు కోసం గతంలో టీడీపీ నుంచి ఎన్డీఏ హాయంలో వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా.. స్పీకర్ గా వ్యవహరించిన బాలయోగి కుమారుడు హరీష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. హరీష్ అమలాపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.