ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడా పోలీస్ డిప్యూటీ కమిషనర్ తనిఖీలో కాన్పూర్ నుంచి వచ్చిన 138 మంది పోలీసులలో 115 మంది అదృశ్యమైనట్లు తేలింది. లోక్సభ ఎన్నికల బందోబస్తు డ్యూటీలో ఉన్న ఈ పోలీసులకు దాద్రీలోని అన్షు పబ్లిక్ స్కూల్లో వసతి సౌకర్యం కల్పించారు. అయితే వీరు రాకపోవడంతో నోయిడా పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.