టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఎన్నికల సంఘం (ఈసీ)కి వైసీపీ ఫిర్యాదు చేసింది. సీఎం జగన్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. లోకేష్ తన ప్రసంగాలతో హత్యారాజకీయాలను ప్రేరేపిస్తున్నారని వెల్లడించింది. తాడేపల్లిలో వైసీపీ కార్యకర్తను టీడీపీ నేతలు కొట్టి చంపారని, వెంటనే టీడీపీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది.