సాయం అందుకునేందుకు వెళ్లి 12 మంది మృత్యువాత

573చూసినవారు
సాయం అందుకునేందుకు వెళ్లి 12 మంది మృత్యువాత
ఇజ్రాయెల్-హమాస్ జరుగుతున్న యుద్ధం కారణంగా గాజా ప్రజలు నలిగిపోతున్నారు. తినడానికి తిండిలేక, తాగేందుకు నీళ్లు లేక, తలదాచుకునేందుకు గూడు లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య వేలు దాటగా తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. ఆకాశం నుంచి విడిచిన సాయాన్ని అందుకునేందుకు ప్రయత్నించి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియా బీచ్‌లో ఈ ఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్