BREAKING: లారీ, బైకు ఢీ.. ఒకరి మృతి

50చూసినవారు
BREAKING: లారీ, బైకు ఢీ.. ఒకరి మృతి
అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం వత్తలూరుకు చెందిన హరి తన భార్య శ్రీలక్ష్మితో కలిసి బైక్‌పై రాజంపేట వైపు వెళ్తున్నాడు. లారీ ఢీకొట్టడంతో హరి అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీ లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్