యాపిల్ సీఈఓతో 13 ఏళ్ల భారతీయ బాలుడు.. ఫొటో వైరల్

77చూసినవారు
యాపిల్ సీఈఓతో 13 ఏళ్ల భారతీయ బాలుడు.. ఫొటో వైరల్
యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను 13 ఏళ్ల శౌర్య గుప్తా అనే భారతీయ సంతతికి చెందిన కుర్రాడు కలిశాడు. వీరికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. యాపిల్ అతిపెద్ద ఈవెంట్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 జరుగుతోంది. ఈ క్రమంలో టిమ్ కుక్‌తో కలిసి శౌర్య నవ్వుతూ ఫోటోకు పోజ్ ఇచ్చాడు. ఈ మేరకు మొదటిసారి టిమ్ కుక్‌ని కలిసి దిగిన ఫోటోను శౌర్య తన X ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా.. మిషన్ కంప్లీటెడ్ అని రాసుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్