రాజస్థాన్లోని కోటాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. కున్హాడి పోలీస్ స్టేషన్ పర
ిధిలోని సగత్పురా కాళీ బస్తీలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుని ఊరేగింపు చేపట్టారు. ఈ క్రమంలో ఊరేగింపులో ఉన్న 14 మంది చిన్నారులకు కరెంట్ షాక్ తగిలింది. వారిలో ఇద్దరికి 50 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.