చాందీపురా వైరస్‌తో 16 మంది మృతి

71చూసినవారు
చాందీపురా వైరస్‌తో 16 మంది మృతి
గుజరాత్‌లో చాందీపురా వైరస్ ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ వల్ల 16 మంది చనిపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ తాజాగా ప్రకటించారు. మరో 50 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చాందీపురా వైరస్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఇది దోమలు, ఇతర కీటకాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, ఫ్లూ, మెదడు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్