తెలంగాణ మంత్రికి వైసీపీ కీల‌క నేత కౌంట‌ర్

78చూసినవారు
తెలంగాణ మంత్రికి వైసీపీ కీల‌క నేత కౌంట‌ర్
AP: మంత్రి కొండా సురేఖ నాగచైత‌న్య‌- స‌మంత విడాకుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి స్పందించారు. "ఇప్పటికే ప్రజల్లో రాజకీయాలు అంటే ఒక చులకన భావంతో చూస్తున్నారు. ఒక ఉన్నత పదవీలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాజకీయాల కోసం ఒక వ్యక్తి కుటుంబ విషయాలను, వ్యక్తిగత విషయాలను వాడుకోవడం ఒక నీచమైన చర్య" అని ఆయ‌న త‌న ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్