నిమిషానికి 20 మంది శరణార్థులుగా తరలివెళ్లాల్సిన పరిస్థితి!

76చూసినవారు
నిమిషానికి 20 మంది శరణార్థులుగా తరలివెళ్లాల్సిన పరిస్థితి!
ఇళ్లు నిప్పుల కుంపటిలా మారితే తప్ప ఎవరూ తన గూటిని వదిలి బయటకు వెళ్లేందుకు సిద్ధపడరు. ఎవరైనా పుట్టిన ఊరిని వదిలి వెళ్తున్నారంటే అక్కడ అరాచకం రాజ్యమేలుతూ ఉండాలి. లేదంటే ప్రకృతి ప్రకోపంతో సర్వస్వం కొట్టుకుపోయి అయినా ఉండాలి. జాతుల మధ్య పోరాటం, యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 20 మంది తమ స్వస్థలాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత పోస్ట్