వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసినా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,584 మంది భక్తులు దర్శించుకోగా, 31,848 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు సమకూరింది.