దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. ఇందులో ఏపీలో 1,215, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఈ నియామకాలు చేపడతారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి. పోస్టును బట్టి వేతనం ఉంటుంది.