బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యాబ్‌లో విష వాయువులు లీకై 24 మంది విద్యార్థులకు అస్వస్థత

66చూసినవారు
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యాబ్‌లో విష వాయువులు లీకై 24 మంది విద్యార్థులకు అస్వస్థత
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యాబ్ లో విష వాయువులు లీక్ అయ్యాయి దీంతో 24 మంది విద్యార్థులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. 6, 7వ తరగతులకు చెందిన విద్యార్థులు ప్రయోగం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రయోగం మధ్యలో సైన్స్ టీచర్ ల్యాబ్ నుంచి బయటకు వెళ్లారని, దీంతో విద్యార్థులు తప్పుడు ప్రయోగం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్