ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్ స్కూటర్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఫిబ్రవరి నెలకుగానూ ఎంపిక చేసిన స్కూటర్లపై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఎస్1 ప్రో, ఎస్ ఎయిర్, ఎస్1 ఎక్స్+ మోడళ్లకు తగ్గింపు వర్తిస్తుందన్నారు. సవరించిన ధరలు ఫిబ్రవరి 16 నుంచే అందుబాటులోకి వస్తాయని భవీశ్ తెలిపారు.