వడదెబ్బ కారణంగా 41 మంది మృతి

84చూసినవారు
వడదెబ్బ కారణంగా 41 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే గరిష్ఠ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వేడిగాలుల కారణంగా వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ వేసవిలో హీట్‌వేవ్స్‌ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బ కారణంగా అత్యధికంగా బీహార్‌ రాష్ట్రంలో 20 మంది మృత్యువాత పడ్డారు.

సంబంధిత పోస్ట్