రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది అంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ ఉద్యోగ ప్రకటన నకిలీదని స్పష్టం చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అలాంటి నోటీసు ఏదీ రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది.