గడిచిన 32 నెలల్లో 48 మంది జవాన్లు మృతి

56చూసినవారు
గడిచిన 32 నెలల్లో 48 మంది జవాన్లు మృతి
జమ్ముకాశ్మీర్‌లోని జమ్ము ప్రాంతంలో గత 32 నెలల్లో ఎన్‌కౌంటర్‌లలో మరణించిన మొత్తం జవాన్ల సంఖ్య 48కి చేరినట్లు అధికారులు తెలిపారు. దొడా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. అధికారుల సమాచారం ప్రకారం.. దొడా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు భారత ఆర్మీ, జమ్ముకాశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్