హైదరాబాద్లో 24 గంటల వ్యవధిలో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జరగడం కలకలం రేపింది. పాతబస్తీ శాలిబండలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురయ్యాడు. తుకారాంగేట్లోని అడ్డగుట్టలో భార్య రోజాను భర్త హత్య చేశాడు. మల్లపల్లి అసీఫ్నగర్ లో అలీం అనే వ్యక్తి దారుణ హత్య, కాచిగూడలో ఖిజార్ అనే వ్యక్తి హత్య, సనత్నగర్ భరత్నగర్లో అజార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. శాలిబండలో వజీద్, ఫకృద్దీన్లపై హత్యాయత్నం జరిగింది.